Top Stories

జనంలోకి రావడానికి పవన్ భయపడ్డాడు

ఒకప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజల్లోకి వెళ్లి నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ — ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజలనే దూరం చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదు. ఆ హామీల గురించి ప్రశ్నిస్తారనే భయంతో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లే ప్రతి పర్యటనలో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా ఆయన పర్యటనల్లో పోలీసులు భారీ బారికేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఆయనను చేరుకోవడం, మాట్లాడడం, సమస్యలు వినిపించడం సాధ్యం కావడం లేదు. “బారికేట్ల డిప్యూటీ సీఎం” అనే బిరుదు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన నాయకుడు బారికేడ్ల వెనుక దాక్కోవడం ఎలాంటి పాలనకు సంకేతమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో పవన్ కళ్యాణ్ నిర్భయంగా రోడ్లపైకి వచ్చి ప్రజల సమస్యలను బహిరంగంగా ఎత్తిచూపారు. కానీ ఇప్పుడు అధికారం రాగానే అదే ప్రజలను ఎదుర్కోవడానికే భయపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. “ప్రజల పక్షాన పోరాడతాను” అన్న వాగ్దానం క్రమంగా మాటల్లోనే మిగిలిపోయిందని జనసేన కార్యకర్తల్లో కూడా అసంతృప్తి పెరుగుతోంది.

ప్రజలు ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే బారికేడ్ల వెనుక దాక్కునే పవన్ కళ్యాణ్‌కి నిజంగా ప్రజలపై నమ్మకముందా?

https://x.com/YSJ2024/status/1983755413989552513

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories