Top Stories

పిచ్చండీ ఇదీ!

చాదస్తం.. ఫస్ట్రేషన్.. ఏం చేయాలో తెలియని అయోమయం.. ‘నీకు 15 వేలు.. నీకు 18 వేలు అంటూ ’ మహిళలందరికీ వేలకు వేలు ఇస్తామన్న టీడీపీ బ్యాచ్, చంద్రబాబు ఇప్పుడు నిధులు లేక పిల్లిమొగ్గలు వేస్తున్నారు.ఏం చేయాలో తెలియక.. డబ్బులు లేక శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. జగన్ అప్పులు చేశాడు.. డబ్బులు ఇవ్వలేను అంటూ పెడబొబ్బలు పెడుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను పిచ్చిపత్రాలుగా, వ్యర్ధ పత్రాలుగా మార్చేశారా అన్న అభిప్రాయం కలుగుతోంది. అయినదానికి, కానిదానికి శ్వేతపత్రాలు ఇవ్వడం ద్వారా వాటి విలువను ఆయనే పొగొట్టారనిపిస్తుంది.

ఏవైనా ప్రధాన అంశాలపై వైట్ పేపర్స్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంటుంది. అంతే తప్ప-ప్రతి చిల్లర విషయానికి ఉన్నవి, లేనివి కలిపి కాకి లెక్కలతో పత్రాలు ఇస్తే అది వృధా ప్రయాసే అవుతుంది. వాటి సీరియస్ నెస్ కూడా పోతుంది. ప్రస్తుతం ప్రభుత్వంలో తాము ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో అర్దంకాక, ఎలా ప్రజలను మభ్య పెట్టాలా అన్నదానిపై ఎడతెగని ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఈ శ్వేతపత్రాలను ముందుకు తీసుకు వచ్చారనిపిస్తుంది. చంద్రబాబుకు ఇది బాగా పాత అలవాటు.

1994లో ఈయన ఎన్‌టీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండేవారు. అప్పుడు కూడా రెవెన్యూ, ఫైనాన్స్ శాఖలకు సంబంధించి వైట్ పేపర్స్ ఇచ్చారు. తదుపరి ఎన్‌టీఆర్‌ను పడదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల వాగ్దానాలను ఎగవేయడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ తంతును సాగించారు. ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తివేశారు. రేషన్ బియ్యం రేటు పెంచారు. 2004 ఎన్నికలకు ముందు కూడా వాస్తవ పత్రాలు అంటూ ప్రభుత్వ ప్రచార పత్రాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ది చేసింది చెప్పడానికి ఆయన ఆ పత్రాలు ఇచ్చారు. కాని జనం వాటిని నమ్మలేదు.. టీడీపీని ఓడించారు.

ఇప్పుడు కూడా జగన్ పై నెపం నెట్టేసి డబ్బులు లేవని చూపిస్తూ ఏపీ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు.శ్వేతపత్రాల పేరిట కాలయాపన చేస్తు్నారు. ‘పిచ్చండీ ఇదీ’ అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories