Top Stories

రఘురామకు అసెంబ్లీలో అవమానం

ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ సీనియర్ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారును అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో ఆయన అవమానంగా ఫీలయ్యారు. అక్కడున్న అధికారులపై మండిపడ్డారు.

మంత్రుల కాన్వాయ్‌ మాత్రమే లోపలికి అనుమితిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతమంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఇదే అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ కోరాలని తన లేఖలో కోరారు రఘురామ.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు రఘురామరాజు. స్పీకర్‌ పదవి తనదేనని చెప్పుకున్నారు. స్పీకర్‌ పదవి లేకపోతే కేబినెట్‌లోనైనా చోటు దక్కుతుందని భావించారు. కానీ, ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఎమ్మెల్యేగానే ఉండిపోయారు.

నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రఘురామను చేర్చుకోవడానికి ఏ పార్టీ ఇష్ట పడలేదు. ముందుగా ఆయన బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించారు. ఐతే రఘురామను చేర్చుకునేందుకు నిరాకరించిన బీజేపీ.. ఎంతో కాలంగా పార్టీకి విధేయుడుగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది. అంతేకాదు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కట్టబెట్టింది. ఇక చివరకు రఘురామకు టీడీపీ ఆశ్ర‌య‌మిచ్చింది. తర్వాత ఉండి టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories