Top Stories

వైసీపీకి భారీ ఊరట- ఆయనకు విపక్ష నేత హోదా..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్ధితుల్లో అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల మేరకు అసెంబ్లీలో 10 శాతం సభ్యులు ఉన్న పార్టీకే విపక్ష నేత హోదా ఇస్తామని చెబుతోంది. దీంతో కేవలం 11 మంది ఎమ్మెల్యేల్ని గెల్చుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారు.

ఈ తరుణంలో వైసీపీకి శుభవార్త అందింది. అసెంబ్లీలో తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదన్న కారణంతో విపక్ష నేత ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నా.. మండలిలో మాత్రం మెజార్టీకి మించి ఎమ్మెల్సీల బలం ఉన్న ఆ పార్టీకి విపక్ష నేత హోదా దక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో విపక్ష నేతగా గుర్తిస్తూ ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ పేరిట సోమవారం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.

మరోవైపు శాసనసభలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇప్పటివరకూ అసెంబ్లీలో సభ్యులకు స్పీకర్ సీట్ల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో సభ్యులు తమకు నచ్చిన చోట కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీ పరిస్ధితి మెరుగ్గా కనిపిస్తోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories