Top Stories

ABN Venkatakrishna : బుల్లెట్ దిగిందా.. లేదా.. ఏబీఎన్ వెంకటకృష్ణ?

ABN Venkatakrishna : వెంకటకృష్ణకు ఉన్న దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న ఆశ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణలో ఏమాత్రం లేదని ఆయన పెట్టే డిబేట్ల సారాంశాన్ని బట్టి అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ, ఒకసర్వే అనలిస్టును కూర్చుండబెట్టుకొని తాజాగా చర్చ పెట్టాడు ఏబీఎన్ లో వెంకటకృష్ణ. అందులో వాస్తవాలు బట్టలిప్పి మాట్లాడుకుందాం అంటూ నిజాలు కక్కేశాడు.

2019లో టీడీపీ ఇంత డిజాస్టర్ గా ఓడిపోతుందని కలలో కూడా తాను సహా ఎవరూ అనుకోలేదని వెంకటకృష్ణ బావురుమన్నాడు. కారణాలు ఏవైనా సరే టీడీపీకి బుల్లెట్ దిగిందా? లేదా? అంటూ సొంత టీడీపీ, చంద్రబాబుకే బొక్క పెట్టాడు ఈ వెంకటకృష్ణ. అప్పుడు పొత్తులు పెట్టుకోలేదని.. ఓడిపోయినవి మహా అయితే 5వేల ఓట్ల లోపు అని అనలిస్టులు కవర్ చేసినా వెంకటకృష్ణ మాత్రం టీడీపీ ఓటమిని ఎంత మాత్రం ఒప్పుకోలేదు.

అంత డిజాస్టర్ గా టీడీపీ 2019లో ఓడిపోతుందని ఏ అంచనాలకు అందకుండా ఫలితం వచ్చింది. టీడీపీ గెలవదని అన్నారు. జగన్ గెలుస్తాడని అన్నారు. వైసీపీకి 151 వస్తాయని.. టీడీపీ ఉత్త 23 వస్తాయని ఎవరూ చెప్పలేదని వెంకటకృష్ణ ఏబీఎన్ స్టూడియోలో అవమానభారంతో కృంగిపోయాడు.

సర్వేలకు కూడా జనం నాడి అందదా అని 2019లో తనకు అనిపించిందని.. ఈసారి కూడా టీడీపీ ఓడిపోతుందన్న భయం తనను వెంటాడుతోందని వెంకటకృష్ణ భయపడిపోయాడు. దీన్ని బట్టి ఎల్లో మీడియాలో, టీడీపీలో ఓటమిభయం వెంటాడుతోందని.. ఓటమి ఖాయమని అర్థమవుతోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories