Top Stories

నీతులు చెప్పే ఏబీఎన్ ఆర్కే అసలు రూపం ఇదీ.!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక మీడియా సంస్థ అధిపతి నిత్యం సమాజ ఉద్ధరణ గురించి అనేక వ్యాఖ్యలు చేస్తుంటారు. తాను మాత్రమే ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను అన్నట్టుగా సదరు మీడియా సంస్థ యజమాని వ్యవహార శైలి ఉంటుంది. అయితే, సదరు మీడియా సంస్థ యజమాని చేసే పనికి, చెప్పే మాటలకు పొంతనే ఉండదు. ఆయనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల యజమాని వేమూరి రాధాకృష్ణ. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎదుటివారి ఇళ్లల్లో ఏం జరిగిందో చెప్పేందుకు తాపత్రయపడే రాధాకృష్ణ.. తన సంస్థలో జరుగుతున్న విషయాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగులకు కనీస స్థాయిలో జీతాలను ఇవ్వలేని ఆయన.. ఇతరుల గురించి మాత్రం బాగానే చెబుతుంటారు. ఈ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు లైన్ ఎకౌంటు సరిగా ఇవ్వరనే అపవాదు ఉంది. ఒకవేళ ఇచ్చిన అది పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవు. ఇక ఆ సంస్థ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్లు పేరుతో వేధింపులకు గురి చేస్తుంటారు. రిపోర్టర్లను వార్షిక చందాలు బుక్ చేయాలని కొన్ని నెలలపాటు ఇబ్బందులకు గురిచేస్తుంటారు. వార్షిక చందాల ప్రక్రియను ఎలాగోలా పూర్తి చేశామని గుండెల మీద చేయి వేసుకునేసరికి.. వార్షికోత్సవ ప్రకటనల టార్గెట్ రిపోర్టర్ల ముందు పడుతుంది. లక్షలాది రూపాయలు యాడ్స్ చేస్తేనే గాని ఒప్పుకోను పరిస్థితి ఆ యాజమాన్యానిది. జిల్లా మేనేజర్లు ఆయా రిపోర్టర్లను లక్ష్యాలు చేరుకోవాలంటూ వేధిస్తుంటారు.

గడిచిన నెల రోజులుగా వార్షికోత్సవానికి సంబంధించిన తతంగం జరుగుతోంది. నెల రోజుల నుంచి కింద మీద పడుతున్న యాజమాన్యం విధించిన లక్ష్యంలో 50 శాతాన్ని కూడా చేరుకోలేకపోయారు. రెండు రాష్ట్రాల్లోనూ సదరు మీడియా సంస్థ యజమానికి అనుకూలమైన ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయిలో లక్ష్యాలను చేరుకోకపోవడంతో ఒకంత అసహనాన్ని యాజమాన్యం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి వార్షికోత్సవ ప్రకటనల గొడుగును మరో 15 రోజులు పాటు పెంచినట్లు తెలిసింది. ఈ గడువులోగా మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవాలని రిపోర్టర్లకు ఆదేశాలు ఉన్నత స్థాయి నుంచి వచ్చాయి.

ఒకవైపు సర్కులేషన్, మరోవైపు యాడ్స్ టార్గెట్లను చేరుకోలేక ఎంతో మంది రిపోర్టర్లు బయటకు వచ్చేస్తున్నారు. కొందరు మాత్రం అందులోనే ఉండి ఈ బాధలను పడుతూనే ఉన్నారు. యాడ్స్ ఇవ్వకుంటే ఆ పత్రికలో వచ్చే కథనాలు వేరేగా ఉంటాయి అన్న ప్రచారం బయట ఉంది. పెద్దగోలుగా వార్తలు రాస్తూ ఇబ్బందులకు గురిచేస్తారన్న ఉద్దేశంతో చాలామంది ప్రకటనలు ఇస్తుంటారు. ఆ పత్రికలో వాడే భాష కూడా ఎబ్బెట్టుగానే ఉంటుందే అని పలువురు పేర్కొంటుంటారు. లైన్ అకౌంట్ అడిగితే వేధింపులకు గురి చేస్తుంటారని, తీరా వార్షికోత్సవాల సందర్భంగా మాత్రం లక్షలాది రూపాయలు ప్రకటనలు వేయాలంటూ ఒత్తిడి చేస్తుంటారంటూ పలువురు రిపోర్టర్లు వాపోతున్నారు. ఇదే విషయంపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెల్లారి లేచిన దగ్గర్నుంచి నీతులు చెప్పే రాధాకృష్ణ ఇదా నీ అసలు రూపం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories