Top Stories

సినబాబుకి సినిమా చూపించారు! వైరల్ వీడియో

ఏరుదాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్టుంది కూటమి ప్రభుత్వం పరిస్థితి. అందుకే ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బోలెడన్నీ హామీలిచ్చి గెలిచిన నేతలు ఇప్పుడు జనాల్లోకి పెద్దగా రావడం లేదు.వచ్చిన వారిని ప్రజలు ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.

చంద్రబాబు,పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులు ఇప్పుడు ఎక్కడికెళ్లినా ‘అయ్యా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి’ అని ప్రజలు నిలదీస్తున్నారు. మహిళలు అయితే నేరుగా ముఖం మీదనే ప్రశ్నిస్తున్నారు. దీంతో కక్కలేక మింగలేక సర్ది చెప్పలేక నానా యాతన పడుతున్నారు నేతలు.

తాజాగా నారా లోకేష్ బాబుకు నిలదీతలు ఎదురయ్యాయి. ఔను.. ఆయన ముఖం మీదనే మహిళలు అడిగేసరికి చినబాబుకు ఏం చెప్పాలో ఫాఫం అర్థం కాలేదు. ‘ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.. అధిగమించి ఇచ్చిన హామీలు ఇస్తాం’ అంటూ నారా లోకేష్ సర్ది చెప్పారు. కానీ ముందర ఉన్న మహిళ ‘ఫ్రీ బస్సు’ అన్నారు ఏమైందని ప్రశ్నించింది.. దానికి సినబాబు ‘అమలు చేస్తామమ్మా.. పెన్షన్ పెంచామా లేదా? ఊళ్లో పెన్షన్ పెంచాదు కదా’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి ఆ మహిళ.. ‘మాకు పెంచలేదు’ అంటూ మహిళలు ముఖం మీదే చెప్పేశారు.

ఇలా సినబాబుకు జనం పట్టపగలే చుక్కలు చూపించారు. జనాల్లోకి వెళితే చాలు నిలదీస్తున్నారు. అన్నట్టు ‘నీకు రూ.15వేలు.. నీకు 18 వేలు అన్న నిమ్మల రామానాయుడు స్వయంగా లోకేష్ పక్కనే ఉండి ఇదంతా చూస్తూ ఉండడం కొసమెరుపు..

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

Topics

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

Related Articles

Popular Categories