Top Stories

వైసీపీలో కొత్త వ్యూహ కర్త

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవ్వాలని, ప్రజల్లో మళ్లీ విశ్వాసం సంపాదించాలని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిశ్చయించుకున్నారు. ఇప్పటికే పార్టీ లో కీలక మార్పులు చేపట్టి, జిల్లాల పర్యటనకు సైతం సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త నియామకంపై కూడా జగన్ దృష్టిసారించారు.

ఇప్పటివరకు పార్టీకి సేవలందించిన ఐప్యాక్ సంస్థను کنارపరిచి, కొత్త వ్యూహకర్తను రంగంలోకి దింపాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. బెంగళూరులో ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల విజయంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ త‌ర్వాత రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని బృందం పార్టీకి సేవలందించగా, 2024లో పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో రుషిరాజ్ సింగ్ సర్వీసులపై జగన్ ఆత్మవిమర్శలో పడ్డారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణలో విజయాలు అందించిన సీనియర్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ని వైసీపీకి తీసుకురావాలన్న యోచనలో జగన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రాథమిక చర్చలు పూర్తైనట్టు ప్రచారం. 2029 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జగన్ ఈ వ్యూహకర్తను పార్టీకి పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే టీడీపీ పక్షాన ప్రశాంత్ కిషోర్ సూచనలు అందిస్తుండగా, షో టైం కన్సల్టెన్సీ సేవలూ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి కూడా మళ్లీ కొత్త వ్యూహకర్త అవసరమన్న భావన జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

మొత్తానికి వైసీపీలో వ్యూహాత్మక మార్పులు సాకారమయ్యే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. త్వరలో అధికారికంగా కొత్త వ్యూహకర్త పేరు ప్రకటించే అవకాశముంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories