ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య సరదా సంభాషణ నవ్వులపాలైంది. విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో, చంద్రబాబు అచ్చెన్నాయుడును ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా జరిగిన ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడుని ఉద్దేశించి “నీ పర్సనాలిటీకి యోగా చేయలేవు.. నువ్వు విశాఖలో ప్రధాని మోడీ పాల్గొనే యోగా దినోత్సవంలో పాల్గొనకపోతేనే బెటర్” అని వ్యంగ్యంగా అన్నారు. అక్కడే ఉన్న అధికారుల సమక్షంలోనే బాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో, అచ్చెన్నాయుడు కాస్త అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ వ్యాఖ్యల పరంపర అక్కడితో ఆగలేదు. “నువ్వు ఆకాశంలో ఉన్నావ్, నువ్వు కూడా యోగ దినోత్సవానికి రాకపోతేనే బెటర్” అంటూ చంద్రబాబు మరోసారి అచ్చెన్నాయుడిపై సెటైర్లు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం యోగా దినోత్సవానికి సంబంధించినవిగా కాకుండా, అచ్చెన్నాయుడి రాజకీయ ప్రాభల్యం, అధికారిక వ్యవహారాలపై పరోక్ష విమర్శలుగానూ కొందరు విశ్లేషిస్తున్నారు. అచ్చెన్నాయుడు ఇటీవలి కాలంలో కొన్ని అంశాలపై ముఖ్యమంత్రితో విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో, ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి. అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
వీడియో కోసం క్లిక్ చేయండి