ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడు మృతి చెందాడని ఎల్లో మీడియా, ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరియు టీడీపీ సోషల్ మీడియా దారుణమైన విష ప్రచారం చేశాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవి అని స్వయంగా పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసుల వివరణ ప్రకారం, లింగయ్య అనే వృద్ధుడు మృతికి జగన్ కాన్వాయ్ కారణం కాదు. ఆయన్ని ప్రమాదానికి గురి చేసింది ఒక ప్రైవేట్ వాహనం అని పోలీస్ అధికారులు వివరంగా తెలిపారు. దీంతో ఏబీఎన్ న్యూస్ ఛానెల్ మరియు టీడీపీల అసలు రంగు బయటపడింది. జగన్పై విషం చిమ్మడానికి వారు ఎంతకైనా దిగజారుతారని మరోసారి రుజువైంది.
ఏబీఎన్ ఆర్కే, చంద్రబాబు, టీడీపీలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ ప్రభావాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు పాల్పడటం దారుణమని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. మీడియా తన బాధ్యతను విస్మరించి, నిరాధార ఆరోపణలతో వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి