Top Stories

బాంబు పేల్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతోందని, అదే తరహాలో ఏపీలోనూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జనాభా పెరగకపోతే రాష్ట్ర అభివృద్ధికి ప్రమాదం తప్పదని ఆయన అన్నారు.

తాజాగా తొలి వెలుగు సభలో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలంటే ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఇక వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల కోసం ఈ నిబంధనను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అసలు 1994లో తీసుకువచ్చిన ఈ నిబంధన కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, జనాభా తగ్గుతుండటంతో అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోందని అన్నారు.

ఒకానొక సమయంలో “ఇద్దరు హద్దు.. ఒకరు ముద్దు” అనే నినాదం నడిచినా, ఇప్పుడది సరైనది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, యువత శాతం తగ్గిపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం ఈ ప్రభావాలేనని తెలిపారు. “జనాభా పెరిగితేనే కేంద్ర నిధులు, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి” అని చంద్రబాబు వివరించారు.

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. “ఆ రాష్ట్రాలకు జనాభా ఆధారంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలూ పెరిగాయి. ఏపీలోనూ అలాంటి పరిస్థితి రావాలి” అని చెప్పారు.

ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను తొలగిస్తూ చట్టసవరణ బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2001లో ఏపీలో సంతానోత్పత్తి రేటు 2.6%గా ఉండగా, ప్రస్తుతం అది 1.5%కి పడిపోయిందని వెల్లడించారు. ఇది ఆందోళనకరమైన అంశమని సీఎం తెలిపారు.

సంప్రదాయ కుటుంబ నియంత్రణ విధానాలపై మళ్లీ ఆలోచన అవసరమన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేయడం విశేషం. జనాభా పెంపుతోనే రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూరుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories