ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా, జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలపై చేస్తున్న ప్రచారాన్ని ఆయన తన ఆంధ్రజ్యోతి ఛానెల్లో విమర్శిస్తూ, “అన్ని పథకాలు అమలయ్యాయి, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, జగన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాడు?” అంటూ రచ్చ చేయడం నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే, ఆయన వాదనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదురవుతున్నాయి.
ప్రజలు ముఖ్యంగా ప్రస్తావిస్తున్న అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, అమలు చేసినవి కూడా అరకొరగానే ఉన్నాయని. ఈ నేపథ్యంలో, “ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఏబీఎన్ ఎలా చెప్పగలరు?” అని ప్రశ్నిస్తున్నారు.
మరీ ముఖ్యంగా బాబు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా, ఆయన అమలు చేసిన ఒకే ఒక్క పథకం ‘తల్లికి పంగనామం’ కూడా అందరికీ అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో ఏబీఎన్ వెంకటకృష్ణ ఈ పథకం గురించి మాట్లాడిన వీడియోలను బయటకు తీసి నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
“ఒకవైపు పథకాలు అమలు కాలేదని ప్రజలు విమర్శిస్తుంటే, ఏబీఎన్ వెంకటకృష్ణ మాత్రం అన్నీ సక్రమంగా జరుగుతున్నాయని ఎలా చెప్పగలరు?” అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇది వెంకటకృష్ణ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని, ఆయన వాదనల్లో ‘మస్తు షేడ్స్’ ఉన్నాయని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, మీడియా పాత్ర చాలా కీలకం. ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించాల్సిన మీడియా, ఒక పక్షానికి వత్తాసు పలకడం విమర్శలకు దారితీస్తుంది. ఏబీఎన్ వెంకటకృష్ణ వాదనలు, ప్రజల అనుభవాలకు పూర్తి భిన్నంగా ఉండటం పట్ల సామాన్య ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది ఆయన ఛానెల్ విశ్వసనీయతపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి