ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ కంటే ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, కానీ ప్రభుత్వం వారి స్థాయిని తగ్గిస్తోందని ఆయన మండిపడ్డారు.
తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన సంఘటనను ఉదహరిస్తూ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, “ఎంపీలు, ఎస్పీలు, కలెక్టర్లకు ప్రత్యేక టేబుల్స్ కేటాయించి, కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులతో పాటు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టడం ద్వారా వారి స్థాయిని తగ్గించినట్లు నేను భావిస్తున్నాను” అని తీవ్రంగా విమర్శించారు.
ప్రజా ప్రతినిధులుగా ఎమ్మెల్యేలకు ప్రజలలో ఉన్న గౌరవం, వారి హోదాకు తగిన గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాత్రను అగౌరవపరచడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేలకు సరైన ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వీడియో కోసం క్లిక్ చేయండి