పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ‘అన్నీ నేనే చేశాను’ అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు. హైదరాబాద్ను నేనే కట్టానని, అమరావతిని నేనే అభివృద్ధి చేస్తున్నానని జాతీయ మీడియా ముందు, వివిధ సదస్సులలో గొప్పలు చెప్పుకోవడం ఆయనకు పరిపాటి. తాజాగా, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో అమరావతిని అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో, ఒక జాతీయ మీడియా జర్నలిస్ట్ ఆయన్ను ఈ విషయంపై ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చంద్రబాబు శరామామూలుగానే సమాధానమిస్తూ, తాను హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేశాడో, రంగారెడ్డి జిల్లాకు ఎలా విస్తరించాడో చెప్పుకొచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని ఏఐ హబ్గా ఎలా మారుస్తారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా వివరించలేకపోయారు. దీనిపై ఓ మీటింగ్ పెట్టి సలహాలు తీసుకుంటానని చెప్పడంతో, నెటిజన్లు ఆయన్ను ‘విజనరీ క్లీన్ బౌల్డ్’ అయ్యాడంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు ‘డంబాచారం’ మరోసారి బయటపడిందని, కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవ ప్రణాళికలు లేవని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ వంటి కీలకమైన అంశంపై స్పష్టమైన విధానం లేకపోవడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. అమరావతిని ఏఐ హబ్గా మార్చాలనే ఆలోచన గొప్పదే అయినప్పటికీ, దానిని ఎలా అమలు చేస్తారనేదానిపై చంద్రబాబు నాయుడు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
వీడియో కోసం క్లిక్ చేయండి
https://x.com/GraduateAdda/status/1938633116077162621