గోదావరి తీరానికి ప్రత్యేకమైన యాసతో ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై వేసిన సెటైర్లు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ యువకుడు చంద్రబాబుపై ప్రత్యేకంగా నిప్పులు చెరిగాడు.”ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు బయట గొప్పగా చెబుతాడండి.. కాని లోపల మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఎదురు గొణిగిన వాళ్లను జైళ్లలోకి పంపిస్తున్నారు. ఇవేనా ప్రజాస్వామ్య విలువలు?” అంటూ నిలదీశాడు.
ఆరోగ్యశ్రీపై మాట్లాడుతూ, “నిధులు లేవంటూ చేతులెత్తేస్తాడు.. కానీ అదే చేతులతో మూడొందల పడకల ఆస్పత్రులు కట్టిస్తానంటాడు. మాటలు బాబుకి జోలపాలు.. ప్రజలకు మాత్రం దిక్కులేదు” అని ఎద్దేవా చేశాడు.
తిరుమల లడ్డూ వివాదాన్ని టార్గెట్ చేస్తూ, “తిరుమల తిరుపతిని కల్తీ లడ్డూ డొక్కుతో రాజకీయాల్లోకి లాగిన బాబు.. ఇప్పుడు కల్తీ లేదన్న రిపోర్టొచ్చేసరికి మాత్రం – సన్నాయి నొక్కలతో తప్పించుకుంటున్నాడు” అంటూ చురకలు అంటించాడు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ,”ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానన్న బాబు.. గెలిచాక మాత్రం ‘ఎలా సృష్టించాలో మీరు చెవిలో చెప్పండి’ అంటూ చేతులెత్తేశాడు. ఇదేనా దశాబ్దాల అనుభవం?” అంటూ ప్రశ్నించాడు.
ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవుతుంది.ప్రస్తుత రాజకీయాల్లో నిరాశకు గురవుతున్న యువత భావాలను ఈ యువకుడు తేటతెల్లంగా వ్యక్తీకరించాడంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.పార్టీలకు అతీతంగా ఈ తరం ఓ కొత్త స్వరం వినిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.