తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు మరోసారి వార్తల్లో నిలిచారు. ‘కెరీర్ మీద ఫోకస్ పెట్టు’ అనే వీడియోతో విపరీతంగా ట్రోల్ అయిన ఈ సిస్టర్స్, కొంతకాలం పచ్చళ్ల వ్యాపారం ఆపేసినా.. ఇప్పుడు మళ్లీ తిరిగి బాగానే ముందుకు సాగుతున్నారు.
ఇటీవల రమ్యకు బిగ్ బాస్ సీజన్ 9 లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగినా, ప్రస్తుతం ఆమె పేరు లిస్ట్లో లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇక సుమ విషయానికి వస్తే—తన పెళ్లి రోజున భర్త, సోదరీమణులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. థియేటర్లో కొంతమంది యువకులు ఆమెపై అసభ్య వ్యాఖ్యలు చేయడం, అర్థరహితంగా సైగలు చేయడం వల్ల తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ సంఘటనపై రమ్య వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేయగా, వారు వెంటనే వచ్చి ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు.
సుమ తన యూట్యూబ్ ఛానెల్లో ఈ విషయాన్ని పంచుకుంటూ, “మేము పచ్చళ్ళు అమ్ముతూ మా జీవనం సాగిస్తున్నాం. ఎవరినీ బలవంతం చేయడం లేదు. అయినా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి” అంటూ వాపోయింది.
ప్రస్తుతం సుమ యూట్యూబ్లో 4 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు కలిగి ఉండగా, రమ్య, అలేఖ్యలు కూడా సోషల్ మీడియాలో చురుకుగా కొనసాగుతున్నారు.