Top Stories

బాంబు పేల్చిన బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా పెరుగుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కొనసాగుతోందని, అదే తరహాలో ఏపీలోనూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జనాభా పెరగకపోతే రాష్ట్ర అభివృద్ధికి ప్రమాదం తప్పదని ఆయన అన్నారు.

తాజాగా తొలి వెలుగు సభలో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలంటే ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఇక వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదల కోసం ఈ నిబంధనను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అసలు 1994లో తీసుకువచ్చిన ఈ నిబంధన కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, జనాభా తగ్గుతుండటంతో అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోందని అన్నారు.

ఒకానొక సమయంలో “ఇద్దరు హద్దు.. ఒకరు ముద్దు” అనే నినాదం నడిచినా, ఇప్పుడది సరైనది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, యువత శాతం తగ్గిపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం ఈ ప్రభావాలేనని తెలిపారు. “జనాభా పెరిగితేనే కేంద్ర నిధులు, ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి” అని చంద్రబాబు వివరించారు.

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. “ఆ రాష్ట్రాలకు జనాభా ఆధారంగా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలూ పెరిగాయి. ఏపీలోనూ అలాంటి పరిస్థితి రావాలి” అని చెప్పారు.

ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను తొలగిస్తూ చట్టసవరణ బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2001లో ఏపీలో సంతానోత్పత్తి రేటు 2.6%గా ఉండగా, ప్రస్తుతం అది 1.5%కి పడిపోయిందని వెల్లడించారు. ఇది ఆందోళనకరమైన అంశమని సీఎం తెలిపారు.

సంప్రదాయ కుటుంబ నియంత్రణ విధానాలపై మళ్లీ ఆలోచన అవసరమన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేయడం విశేషం. జనాభా పెంపుతోనే రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూరుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Trending today

టీవీ5 మూర్తి బాధ

ఇటీవల టీవీ5 యాజమాన్యం సంస్థలో కీలక మార్పులు చేసి, తన సుదీర్ఘ...

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

Topics

టీవీ5 మూర్తి బాధ

ఇటీవల టీవీ5 యాజమాన్యం సంస్థలో కీలక మార్పులు చేసి, తన సుదీర్ఘ...

దివ్వెల పిలుస్తోంది ‘దువ్వాడ’

వైసీపీ మాజీ నాయకుడు దువ్వాడ శ్రీనివాసరావుకు ప్రియురాలిగా పేరుపొందిన దివ్వెల మాధురి,...

ఆర్కే మార్క్ మానవత్వం?

ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే...

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Related Articles

Popular Categories