Top Stories

పోసానితో సీఐడీ పోలీసుల సెల్ఫీలు.. వైరల్

 

గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను ప్రదర్శించిన కేసులో అరెస్టయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళితో సీఐడీ పోలీసులు ఫోటోలు దిగడం వివాదాస్పదంగా మారింది.

గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు, ఆయన్ను కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు.

పోసానిని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరగా, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు అనుమతి లభించింది. విచారణ అనంతరం వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలించి, తిరిగి జైలుకు పంపుతుండగా సీఐడీ పోలీసులు ఆయనతో ఫోటోలు దిగారు.

పోసాని జైలులోకి వెళ్లే ముందు, సీఐడీ అధికారులు ఆయనను ఫోటో కోసం అభ్యర్థించారు. ఒక పోలీసు తన ఫోన్ ను సహోద్యోగికి ఇచ్చి పోసాని పక్కన నిలబడి ఫోటో దిగగా, మరొక అధికారి కూడా అదే విధంగా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, రిమాండ్ ఖైదీతో పోలీసులు ఫోటోలు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఆయనకు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories