వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల జరిగిన దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె హాఫ్ శారీ వేడుకల్లో వీరిద్దరూ కలిసి అదిరిపోయే స్టెప్స్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇప్పటికే ఈ జంట పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ పలుమార్లు చర్చనీయాంశంగా మారారు. దువ్వాడ శ్రీనివాస్ తన భార్యను వదిలేసి దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారని, ఇది సమాజానికి మంచి సందేశం కాదని విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ, ఈ జంట తమ పద్ధతిని మార్చుకోవడం లేదు.
తాజాగా విడుదలైన ఈ వీడియోతో మరోసారి వీరి బంధంపై చర్చ మొదలైంది. ఒకవైపు కుటుంబ విలువలు, సంప్రదాయాలపై సమాజంలో చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ జంట తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ విషయంపై దువ్వాడ శ్రీనివాస్ లేదా దివ్వెల మాధురి ఎలా స్పందిస్తారో చూడాలి.