మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దివ్వెల మాధురితో ఆయన సహజీవనం చేస్తున్నారని, ఇంకా అధికారికంగా వివాహం చేసుకోకపోయినా, ఆమెతో బహిరంగంగానే తిరుగుతున్నారని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా, వారిద్దరూ దండలు మార్చుకుని కేక్ కట్ చేసి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఈ వీడియోలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఒకరికొకరు దండలు మార్చుకోవడం, ఆ తర్వాత కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు వారి “వివాహ వార్షికోత్సవం”గా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో బయటపడినప్పటి నుండి, దువ్వాడ శ్రీనివాస్ చేష్టలు, ముఖ్యంగా ఆయన హగ్గులు, ముద్దులు, ఇంకా వారి వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు “ఇంత ఓపెన్ గా ఈ పనులేంటయ్యా” అంటూ దువ్వాడ శ్రీనివాస్ను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు, అధికారికంగా పెళ్లి చేసుకోకుండా ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఈ వీడియోపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజకీయ నాయకుడై ఉండి ఇలాంటి వ్యక్తిగత వ్యవహారాలను బహిరంగంగా ప్రదర్శించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన దువ్వాడ శ్రీనివాస్ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవహారంపై దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఈ వైరల్ వీడియో మాత్రం ఆయనను, ఆయన చర్యలను ప్రజల్లో తీవ్రంగా చర్చనీయంశం చేసింది.
వీడియో కోసం క్లిక్ చేయండి