Top Stories

మళ్లీ సనాతన దీక్ష చేసే టైం వచ్చింది ‘పవనన్నా’.. ఇదీ చూడు!

తిరుమలలో ఏదో జరిగిందని.. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఇప్పటికీ కూడా దాని మీద ఆధారాలు సేకరించలేదు. ఎవరినీ అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ మైలేజ్ కోసం ఇలా ఆరోపించినట్టుగా అర్థమవుతోంది.

తిరుమలలో వేంకటేశ్వరుడి ప్రసాదానికి ఇలా అయితే గొంతు చించుకొన్న పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు ఏకంగా విశాఖలో అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అందరిముందే సుత్తెలతో పగులకొట్టి మరీ పక్కనపెట్టేశారు.

2025 జనవరి 24న విశాఖలో ఘోరమైన అపచారం జరిగింది. విశాఖపట్నంలోని సీతమ్మధార రెవిన్యూ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని జీవీఎంసీ అధికారుల కూలగొట్టడం కలకలం రేపింది.

ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇతర మతాల వారిపై కనీసం ప్రహరీ గోడ కూడా కూలగొట్టడానికి వెళ్లని మున్సిపల్ అధికారులు.. హిందూ దేవుళ్ల విషయంలో ఇంతటి ఘోరమైన అపచారానికి పూనుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు.

ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్పందించి తిరుమలలో లాగానే మెట్లు కడిగి సనాతన దీక్ష చేపట్టి పాప పరిహారం చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన ప్రభుత్వంలో జరిగిన ఈ ఘోరానికి ఎలాంటి చర్యలు తీసుకుంటాడోనని నిలదీస్తున్నారు. మరి ఇది విశాఖలోనే జరిగిందా? నెటిజన్లు కావాలనే వీడియో రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories