Top Stories

చంద్రబాబును ర్యాగింగ్ చేసిన జగన్

గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతుల దుస్థితిని చూస్తుంటే రాష్ట్రానికి అరిష్టం వచ్చిందేనని ఆయన అన్నారు.

జగన్ డిమాండ్ చేస్తూ, చంద్రబాబు వెంటనే గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను కలవాలి అని కోరారు. రైతులకు బాసటగా నిలిచేలా ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేయాలని సూచించారు. బుధవారం జరిగిన తన పర్యటన అనంతరం, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు కష్టాలు, నష్టాలే మిగిలాయి అని జగన్ ఆరోపించారు. పంటలకు మద్దతు ధర కల్పించడమే అక్కర్లేదు.. కనీసం కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ లేరు అని విమర్శించారు. ధాన్యం రైతుల పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మిర్చి రైతులు కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

తాను అధికారంలో ఉన్న సమయంలో మిర్చి ధర క్వింటాలకు 21 నుంచి 27 వేల రూపాయల వరకు ఉండేదని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడేమో అది 11 వేలకు పడిపోవడం దారుణం అని మండిపడ్డారు. గుంటూరు మార్కెట్ యార్డ్ సీఎంఓకు అతి సమీపంలో ఉన్నా, చంద్రబాబు అక్కడి రైతుల బాధలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు “సూపర్ సిక్స్, సూపర్ సెవెన్” అంటూ రైతులకు హామీలు ఇచ్చి, 20 వేల రూపాయలు ఇస్తామని నమ్మబలికారు అని జగన్ ఆరోపించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా సహా పలు సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. “పలావూ లేదు, బిర్యానీ లేదు.. రైతు భరోసా కూడా నిలిపివేశారు” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

చంద్రబాబు ఇప్పటికైనా కళ్లుతెరిచి రైతుల సమస్యలను గుర్తించాలి అని డిమాండ్ చేసిన జగన్, “రైతే రాజన్న” అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని” స్పష్టం చేశారు.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories