రాజకీయాల్లో మర్యాద, సమవేదన, సమగ్ర సంస్కారం ముఖ్యమైనవే. అయితే ఇటీవల జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కుమార్ వ్యవహారం దీనికి పూర్తి భిన్నంగా నిలిచింది. రైల్వే కోడూరు నేత ఇటీవల ఓ వీడియోలో ఉపయోగించిన అశ్లీల పదజాలం, పచ్చిబూతులు తీవ్ర విమర్శలకు లోనవుతున్నాయి.
ఈ వీడియోలో నాగేంద్ర తన ప్రతిపక్ష నేతలపై తీవ్రంగా, అశ్లీలంగా వ్యాఖ్యలు చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. “నీ అమ్మ.. నీ అక్క.. నీ ఆలి..” వంటి నీచమైన పదజాలాన్ని ఓ నేత నుంచి వినడం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దారుణమే..
జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో “నీతి, నిబద్ధత, ప్రజాసేవ” అనే మంత్రంతో ముందుకు సాగాలని సూచించిన సంగతి తెలిసిందే. అలాంటి పార్టీకి చెందిన ఒక రాష్ట్రస్థాయి నాయకుడు ఇలా బూతులు వాడడం ఎంతవరకు సరైంది?
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనది. ఎందుకంటే పార్టీ పేరు మీద నడిచే ప్రతి నాయకుని ప్రవర్తన పార్టీ ప్రతిష్టకు ప్రతిబింబం అవుతుంది.
జనసేన పార్టీ ఎన్నో సార్లు “మర్యాదపూరిత రాజకీయాలు” అనే పదాన్ని నినాదంగా చెప్పింది. మరి ఇలాంటి నేతలు ఆ సిద్ధాంతాలకు మచ్చతెస్తున్నారా? లేక ఇది పార్టీ విధానమా అన్న సందేహాలు జనంలో తలెత్తుతున్నాయి.
వీడియో కోసం క్లిక్ చేయండి
https://x.com/DrPradeepChinta/status/1935707535815663858