తెలంగాణ రాజకీయ వాతావరణంలో ఒక్కసారిగా మహా న్యూస్ చానల్, దాని ఎండీ వంశీ (టాల్కమ్ పౌడర్ వంశీగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి) సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పై ఎలాంటి ఆధారాలు లేకుండా పరుష విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేస్తూ థంబ్ నెయిల్స్ టైటిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వాస్తవాలు నిరూపించగలిగే ఆధారాలు లేకుండా రాజకీయ కుట్రలకు దాసోహమై ఛానెల్ను ఒక పచ్చ మీడియా టూల్గా మార్చిన వంశీ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తే… పళ్ళు రాలగొడతారు” అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఎక్కడా పరిశోధన లేకుండా, నిజాలు పట్టించుకోకుండా, ఒక పార్టీకి అనుకూలంగా టైలర్డ్ కథనాలు ప్రసారం చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
కేటీఆర్ వంటి నాయకుడిపై ఎటువంటి సాక్ష్యం లేకుండా రోజువారీగా నెగటివ్ థంబ్ నేల్స్, క్లిక్ బైట్ హెడ్ లైన్లు పెట్టడాన్ని చూసి చాలామంది ఆగ్రహంగా స్పందిస్తున్నారు. వాస్తవానికి విలేకరులు సమాజానికి దారి చూపించే దీపాలవలె ఉండాలి. కానీ ఈ తరహా యాజమాన్యంతో నడిచే ఛానల్స్ చీకటి రహదారులను చూపిస్తున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు న్యాయం, ప్రజాస్వామ్యం అంటూ నినాదాలు చేయడం… మరోవైపు వ్యక్తిగత వేదాంతాలతో, రాజకీయ కక్షలతో వార్తలు తయారుచేయడం… ఇదే వంశీ, మహా న్యూస్ ద్వంద్వ వైఖరి. “ఇలాంటి వారిని జర్నలిస్టులు అనడం మన సాంకేతిక తప్పిదం. వీళ్లు సమాజానికి పట్టిన రాబందులు” అంటూ సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి