‘కర్మ’ సిద్ధాంతం గురించి మహాన్యూస్ ఎండీ వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఎదురు తగులుతున్నాయని నెటిజన్లు తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడితో విలవిలలాడుతున్న మహాన్యూస్ ఛానెల్, దాని అధిపతి వంశీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు.
వంశీ తన మహాన్యూస్ ఛానెల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్లపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వంశీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ దాడి జరిగిన వెంటనే, గతంలో వంశీ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వంశీ, “కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఏ కాలంలో తప్పు చేస్తామో అదే కాలంలో అది 24 గంటల నుంచి 24 రోజుల్లోనే కర్మ తిరిగి తగులుతుంది. మనం తప్పు చేస్తే కర్మ ఎక్కువ కాలం ఆగడం లేదు” అని స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం మహాన్యూస్పై జరిగిన దాడి, వంశీ పరిస్థితిని ఈ పాత వీడియోతో పోలుస్తూ నెటిజన్లు వంశీని ‘టాల్కమ్ పౌడర్ వంశీ’ అంటూ తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. “ఆయన కర్మ ఆయనకే తగిలింది”, “ఇది కర్మ అంటే ఇదేనేమో” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఘటనతో మీడియా స్వేచ్ఛ, రాజకీయ నాయకుల తీరుపై మరోసారి చర్చ మొదలైంది. ఒక మీడియా అధిపతి గతంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనకు ఎదురు దెబ్బగా మారడం గమనార్హం.
వీడియో కోసం క్లిక్ చేయండి
https://x.com/Nallabalu1/status/1939326318023434616