Top Stories

కూటమికి ఏడాది : ఏం సాధించారు?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి (జూన్ 4) ఏడాది పూర్తయింది. గత ఏడాది ఇదే రోజున వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించి, 164 అసెంబ్లీ స్థానాలతో తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకుంది. ‘వై నాట్ 175’ నినాదంతో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురవగా, జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 24 మంది మంత్రులతో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. క్యాబినెట్‌లో ఒక మంత్రి పదవి ఇంకా ఖాళీగానే ఉంది.

-పాలనాపరమైన సవాళ్లు

అయితే, పాలనాపరమైన విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం వెనుకబడింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలు ఏడాది పూర్తయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు, అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు వేల కోట్లు కేటాయిస్తూ, ప్రజలకు అత్యవసరమైన సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కాలంగా నిధుల సమీకరణపై దృష్టి పెట్టి, అభివృద్ధి పనులను పక్కన పెట్టారనే ఆరోపణలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా నిధులు తెచ్చి పూర్తి చేయలేకపోవడం గమనార్హం.

గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందగా, ఇప్పుడు పథకాలు అందకపోవడంతో ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి.

-రాజకీయ సమీకరణాలు

అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించింది. దీంతో సంక్షేమ పథకాల విషయంలో కొద్ది రోజుల పాటు వేచి చూద్దామనే ధోరణి ప్రజల్లో కనిపించినా, ప్రభుత్వ చర్యలపై వ్యతిరేకత కూడా మొదలైంది. అయితే, రాజకీయపరంగా ప్రతిపక్షం అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లకపోవడం కూటమికి కలిసొచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా అందడంతో తటస్తులు, మేధావులు, విద్యాధికులు గత ఐదేళ్ల పరిస్థితిని గుర్తుచేసుకొని, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు.

కూటమి పాలన రెండో ఏడాదిలోకి అడుగుపెట్టడంతో సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇది ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచుతుందేమోనని కూటమి సర్కార్ ఆందోళన చెందుతోంది. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Trending today

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Topics

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

జగన్ కు బెదిరింపులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

జనసేన నేత బూతులపర్వం

రాజకీయాల్లో మర్యాద, సమవేదన, సమగ్ర సంస్కారం ముఖ్యమైనవే. అయితే ఇటీవల జనసేన...

జగన్ ఉంగరం కథేంటి?

రాజకీయ నాయకుల భావోద్వేగాలు, నమ్మకాలు తరచూ వారి వ్యక్తిగత నిర్ణయాల్లో ప్రతిఫలిస్తుంటాయి....

Related Articles

Popular Categories