టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీలు, వాటి అమలు తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ చర్చలో ఓ కమ్యూనిస్టు నేత సంధించిన ప్రశ్నలకు జర్నలిస్ట్ వెంకటకృష్ణకు సమాధానం చెప్పలేకపోయారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో వెంకటకృష్ణ నిర్వహించిన డిబేట్లో పలువురు రాజకీయ విశ్లేషకులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కమ్యూనిస్టు నేత ఒకరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వాటి అమలు తీరును ప్రశ్నించారు. “చంద్రబాబు హామీలు ఇచ్చి అమలు చేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎన్నికల్లో ఓడిస్తారు. మీరెందుకు ప్రశ్నించరు?” అని ఆయన నేరుగా వెంకటకృష్ణను నిలదీశారు.
ఈ ప్రశ్నతో వెంకటకృష్ణ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆయన ముఖంలో అయోమయం, నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి. సాధారణంగా డిబేట్లలో దూకుడుగా వ్యవహరించే వెంకటకృష్ణ, ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. ఆయన ముఖం వాడిపోయి, మాట మౌనంగా మారింది. ఈ సంఘటన డిబేట్లో పాల్గొన్న ఇతర ప్యానలిస్టులతో పాటు, వీక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.