Top Stories

మాపై తిరుగుబాటు చేయండి.. చంద్రబాబు సంచలన పిలుపు

 

ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో ఇసుక, మద్యం అక్రమాలపై కూటమి పార్టీల నేతలు నిత్యం పోరాటాలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే ఇసుక, మద్యం అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఓట్లు కూడా వేయించుకున్నారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక అవే ఇసుక, మద్యం అక్రమాల్లో ఆయా పార్టీల నేతలే మునిగితేలుతున్నారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు స్వయంగా సీఎం చంద్రబాబే తరచుగా చెప్తున్నారు.

తాజాగా కూటమి ప్రభుత్వం మద్యం, ఇసుక విధానాలను అమల్లోకి తెచ్చింది. వీటిని కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అధికార పార్టీల నేతలే వీటికి తూట్లు పొడవడం మొదలుపెట్టేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు చేస్తున్న దందాలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే వీటిపై స్వయంగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. వీరికి పదే పదే హెచ్చరికలు చేయాల్సి వస్తోంది. తాజాగా ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబు ఇలాంటి హెచ్చరికలే చేశారు.

ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ సొంత పార్టీ నేతల్ని చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే జనం తిరుగుబాటు చేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు. మద్యం, ఇసుక విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని మరోసారి తేల్చిచెప్పేశారు.అంతే కాదు గీత దాటితే ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories