తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపగా, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచే తిరుమలలో సంప్రదాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూలు తయారవుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఎస్ఐటీ తాజాగా 200 పేజీలకు పైగా చార్జిషీట్ను నెల్లూరు కోర్టులో దాఖలు చేసింది. లడ్డులో కల్తీ జరగలేదని, స్వచ్ఛమైన నెయ్యినే వాడినట్లు నివేదిక వెల్లడించింది. అయితే 10 శాతం కంటే తక్కువ జంతు కొవ్వు ఉండే అవకాశం ఉందన్న అంశాన్ని పరికరాలతో నిర్ధారించలేమని పేర్కొనడంతో రాజకీయ వాదనలు మళ్లీ చెలరేగాయి.
ఇదిలా ఉండగా, వైసీపీ నేతలు క్షమాపణలు కోరుతూ మీడియా ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా లీకైన ఓ వీడియోలో వైసీపీ నేత రోజా, జోగి రమేష్తో మాట్లాడుతూ “తప్పు చేశారు… దేవుడితో పెట్టుకున్నారు… టిడిపిలో లోపల భయం ఉంది” అంటూ వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి, మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది.


