Top Stories

హిట్ లిస్టులో ఆరుగురు మాజీ మంత్రులు..

 

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూముల అక్రమాలకు పాల్పడిన ఆరుగురు మాజీ మంత్రులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే పలువురు వైసిపి నేతలు అరెస్ట్ కాగా, తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.

జగన్ ప్రభుత్వంలో ఆరుగురు మంత్రులు భూ దందాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం వారి అరెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు.

వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములు అడ్డగోలుగా కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మంత్రులు తమ అనుచరులు, బినామీలతో కలిసి భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారని సమాచారం. అప్పట్లో అధికారంలో ఉండటంతో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అధికారం మారడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

గత కొద్ది నెలలుగా రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో భూ కబ్జాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు నివేదికను సీఎంకు అందజేశారు.

వైసిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా, అందులో 5.74 లక్షల ఎకరాలను నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఇందులో 55 వేల ఎకరాల రిజిస్ట్రేషన్ జరగ్గా, 8483 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆరుగురు మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసిల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు కీలక పాత్ర పోషించినట్లు రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొంది.

భూ దందాకు పాల్పడిన వారిపై 1977 నాటి చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఆర్డీవోలు, తహసిల్దార్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories