జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విసిరిన సెటైరికల్ డైలాగ్ “కార్పొరేటర్కు ఎక్కువ… MLAకు తక్కువ” ఇప్పుడు ఒక వైరల్ వీడియోకు కారణమైంది. ఈ డైలాగ్ ఆధారంగా రూపొందించిన డీజే మిక్స్ పాటకు జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు డ్యాన్సులతో హోరెత్తించారు.
గతంలో, వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు, జగన్ మోహన్ రెడ్డి “కార్పొరేటర్కు ఎక్కువ… MLAకు తక్కువ” అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాజాగా ఇదే డైలాగ్ తో డీజే మిక్స్ చేసిన ఒక పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పల్నాడులో జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, ఈ పాటకు ముసలి ముతక, ఒక ముసలవ్వ, యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ కు గట్టి సెటైర్లు వేసినట్లుగా ఈ వీడియో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సంఘటన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.
వీడియో కోసం క్లిక్ చేయండి
https://x.com/DrPradeepChinta/status/1935239284275167621