Top Stories

ఏపీకి మరో వాయుగుండం.. ఇది మరో స్కామ్ గండమే

విపత్తులు వస్తే ఎవరైనా భయపడతారు. వేలాదిమంది నిరాశ్రయులు అవుతారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతుంది. అందుకే విపత్తు పేరు వింటేనే చాలామంది భయాందోళన చెందుతుంటారు. కానీ, ఏపీలో మాత్రం ప్రకృతి విపత్తులు అంటే కూటమి నేతలు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకంటే విపత్తును కూడా ఆదాయ వనరుగా మార్చుకోవడంలో కూటమి నేతలకు మించిన వాళ్లు మరొకరు ఉండరు. కొద్ది రోజుల కిందట వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. ప్రతిపక్ష వైసిపితోపాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. అయితే ఈ విపత్తును కూడా లాభసాటిగా మార్చుకోవడంలో టిడిపికి మించిన సిద్ధహస్తులు లేరనే చెప్పాలి.

వరద బాధిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించిన పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్లాది రూపాయలు ఖర్చు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చూపించిన లెక్కలను చూసి వరదబాధిత ప్రాంతాల్లోని ప్రజలు ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు విపత్తును కూడా ఆదాయ వనరుగా మార్చుకోవడం అంటే ఇదేనేమో అంటూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసిన విపత్తు సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాలు, దానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించిన లెక్కల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వాతావరణ శాఖ నుంచి మరో వచ్చింది. ఈనెల 22న ఆల్పపీడనం ఏర్పడుతుందని అది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాయుగుండం హెచ్చరికతో రాష్ట్రంలోని ప్రజలు ఆందోళన చెందుతుంటే కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. రెండు చేతులతో కోట్లాది రూపాయలు దోచుకునే అవకాశాన్ని వాయుగుండం కల్పిస్తోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే.. రాష్ట్ర ప్రజలు మాత్రం వాయుగుండం కాస్త మరో స్కాం గండంగా కనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాయుగుండం ఎంత పెద్ద స్కాం గండంగా మారుతుందో తెలియడం లేదంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ వాయుగుండం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటూ సాధారణ ప్రజలు కోరుకుంటుండగా.. కూటమి నేతలు మాత్రం వాయుగుండం పరిధిని పెంచేలా వరుణ దేవుడును కోరుకుంటున్నారు. అప్పుడే కాస్త లెక్క ఎక్కువ చూపించి మరింత బొక్కేందుకు ఎందుకు అవకాశం ఉంటుందని టిడిపి నేతలు భావిస్తుండటమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. ఈ వాయుగుండం మరో స్కాం గండం అవుతుందా.? వరుణ దేవుడు కూటమి నేతలకు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను కాపాడుతాడా చూడాలి మరి.

Trending today

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

Topics

దువ్వాడ.. మళ్లీ కెలికాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు స్వభావం కలిగిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,...

కుప్పంలో మరో దారుణం.. వైరల్ వీడియో

గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను...

అపహాస్యం

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఇటీవల ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు తీవ్ర...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన...

సింగయ్య మృతి.. అసలు నిజం ఇదీ

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో, మీడియాలో తీవ్ర...

గిన్నిస్ రికార్డ్ వేళ.. గిరిజన విద్యార్థుల గోస.. షాకింగ్ వీడియో

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్...

యోగాలో పవన్ మెలికలు.. వైరల్ వీడియో

విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్...

పవన్ కళ్యాణ్ కనుబడుట లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన...

Related Articles

Popular Categories