Top Stories

400 కోట్ల బస్టాండ్’ భూమి లూలూ సంస్థకు?

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న లులూ గ్రూప్ భారీ మాల్ ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ భూముల కేటాయింపుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం లులూ గ్రూప్‌కు కారుచౌకగా ప్రభుత్వ భూములను అప్పగించి జేబులు నింపుకోవడానికి ప్రయత్నిస్తోందని వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉన్న ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలం, అలాగే విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో స్థలాన్ని లులూ సంస్థకు కేటాయించాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం ఉందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం విజయవాడ పాత బస్టాండ్ స్థలం విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని ఆయన అంచనా వేశారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో స్థలం విలువ కూడా చాలా ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు.

ఒక కార్పొరేట్ సంస్థకు ఇంత విలువైన ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టాలన్న నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వం మరో అతిపెద్ద అవినీతి పర్వానికి తెరలేపిందని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. అసలు ఒక కార్పొరేట్ సూపర్ మార్కెట్ సంస్థకు ప్రభుత్వం విలువైన స్థలాలు కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దేశంలో చాలా చోట్ల వాల్‌మార్ట్ మార్కెట్‌లు ఏర్పాటయ్యాయని, అవి తమంతట తాము స్థలం సేకరించుకుని, తమ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి తప్ప, ఎక్కడా ప్రభుత్వం వారికి విలువైన స్థలాలు ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టీడీపీ ప్రభుత్వం ఈ పని చేస్తోందని దుయ్యబట్టారు.

గతంలో విశాఖపట్నంలో లులూ గ్రూప్‌కు 13.43 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని నామమాత్రపు లీజుకు ధారాదత్తం చేశారని, దాని విలువ ఏకంగా రూ.2 వేల కోట్లు అని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. పన్ను ప్రయోజనాలు కూడా కల్పించారని ఆయన పేర్కొన్నారు. అయితే, అప్పట్లో వచ్చిన విమర్శలతో ఆ సంస్థ వెనక్కి తగ్గిందని, ఇప్పుడు విజయవాడలో ఆర్టీసీ స్థలం ఇస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు కక్షసాధింపులు, మరోవైపు ప్రభుత్వ భూములను తన బినామీలకు కారుచౌకగా అప్పగించి, తద్వారా జేబులు నింపుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వెంకట్రామిరెడ్డి విమర్శించారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories