ఏపీలో నకిలీ లిక్కర్ స్కాం, టీడీపీ నేతల అవినీతి చర్చలు ఊపందుకుంటున్న వేళ.. టీవీ5 యాంకర్ సాంబశివరావు మరోసారి తన సొంత శైలిలో చానెల్లో ‘శివతాండవం’ చేశారు.
టీడీపీ నేతలు నకిలీ సారాయి స్కాంలతో 5 వేల కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఈ దుమారంలో టీడీపీని రక్షించడానికి సాంబశివరావు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్కు కారణమైంది.
తాజాగా ప్రసారమైన టీవీ5 డిబేట్లో సాంబశివరావు, “వైఎస్ఆర్ హయాంలో గోనె ప్రకాశరావు అనే వ్యక్తి 35 వేల కోట్లు దోచుకున్నాడు” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యతో ప్రేక్షకులు, రాజకీయ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇంతలో నెటిజన్లు మాత్రం మరో కోణంలో సాంబశివరావుపై దుమ్మురేపుతున్నారు. “గోనె ప్రకాశరావు ఎవరో మీకు తెలుసా?” అంటూ ఆ వీడియోలను రీషేర్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. “గోనే ప్రకాష్ రావు ప్రపంచ ఖ్యాతి యెల్లో ఆర్థిక శాస్త్రవేత్త! ఆడమ్ స్మిత్, కౌటిల్యుడు, అమర్త్య సేన్లకు కూడా ఆర్థిక పాఠాలు నేర్పినవాడు!” అంటూ నెటిజన్లు కౌంటర్లతో కామెడీ చేస్తున్నారు..
సాంబశివరావు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు “సాంబా సర్, ఇంత క్రియేటివ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది?” అని వ్యంగ్యంగా రాస్తుండగా, మరికొందరు “టీవీ5 ఇప్పుడు కామెడీ ఛానల్ అయ్యిందా?” అంటూ చమత్కరిస్తున్నారు.
ఏమైనప్పటికీ, రాజకీయ చర్చల్లో ‘లాజిక్’ కంటే ‘డ్రామా’కి ప్రాధాన్యం ఎక్కువగా పెరుగుతున్న ఈ రోజుల్లో, టీవీ5 సాంబశివరావు మరోసారి చర్చకు దారితీశారు.