వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ దూకుడు చూపిస్తోంది. 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం ఎదుర్కొన్న తరువాత పార్టీ శ్రేణుల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిస్తేజాన్ని తొలగించి, నాయకులను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు 40 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “రచ్చబండ” పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసనలు, సభలు, గ్రామస్థాయి చర్చలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.
2024 ఎన్నికలలో పరాజయం తర్వాత సైలెంట్గా ఉన్న నేతలు మళ్లీ యాక్టివ్ అవ్వాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధర్మాన ప్రసాదరావు, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ వంటి నేతలు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడంతో పాటు, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచడమే వైసీపీ లక్ష్యం. అయితే ఈ ఉద్యమం అన్ని ప్రాంతాల్లో విజయవంతం అవుతుందా లేదా అనేది చూడాలి.
జగన్ ప్లాన్ క్లియర్.. పార్టీకి జోష్ ఇవ్వడం, ప్రజల్లో మళ్లీ పట్టు సాధించడం!