విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు “రుషికొండని గుండు కొడుతున్నారు” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రుషికొండ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో రుషికొండలో అద్భుతమైన ఆతిథ్య భవనాలు, సముద్రతీరానికి హుందాతనం చేకూర్చే నిర్మాణాలు చేయబడ్డాయి. ఆ భవనాలను “పీపీపీ విధానంలో” ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి ఇవ్వాలనే చంద్రబాబు నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఇక అంతేకాకుండా, రుషికొండ భవనాల పక్కనే సుమారు 9 ఎకరాల భూమిని హోటల్స్ నిర్మాణం కోసం ప్రైవేట్ సంస్థలకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆ ప్రాంతంలో నిర్మాణాలను వ్యతిరేకించిన బాబు, ఇప్పుడు హోటల్స్ నిర్మాణానికి భూమి ఇవ్వడం విరుద్ధతగా మారింది.
“నిన్న రుషికొండను రక్షించాలన్న బాబు,
ఇవాళ అమ్మకానికి పెట్టాలన్న బాబు ఎందుకు?” జనాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రుషికొండ అందాలను పరిరక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అందమైన పర్వతాన్ని వ్యాపార దళారుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.