ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఒత్తిడి, బెదిరింపులు, వేధింపులు పెరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
తాజాగా పూతలపట్టు మండలానికి చెందిన ఒక వ్యక్తి చేసిన ఆవేదన హృదయాన్ని కదిలిస్తోంది. ఆయన కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ “టీడీపీ నాయకుల వేధింపుల వల్ల మా కుటుంబం బతకలేకపోతోంది. చిన్నారితో కలిసి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” — అని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.., టీడీపీ నేతలు యువరాజ్ నాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు లు తమ కుటుంబాన్ని నిరంతరం వేధిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో రాజకీయంగా తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఈ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారని, అధికార ప్రభావంతో స్థానిక అధికారులను కూడా ప్రభావితం చేస్తున్నారని అన్నారు.
“నేను టీడీపీకి ఓటు వేసి మోసపోయాను. ప్రజల కోసం పనిచేస్తారనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతీ పౌరుడికి భద్రతా హక్కు ఉందనే విషయం మరలా గుర్తుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ వర్గాల మధ్య పోటీ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరకూడదు. ప్రభుత్వం, పోలీసులు ఈ ఘటనపై సీరియస్గా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి.
ప్రజల ప్రాణాలు రాజకీయ అహంకారాల బలిపశువులుగా మారకూడదు. ప్రజల సేవ కోసం ఏర్పడిన పార్టీలు ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను మర్చిపోకూడదు.