Top Stories

ఏపీలో బిచ్చగాళ్లపై చంద్రబాబు ప్రతాపం

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లపై పడ్డారు. ప్రతీ వారం కేంద్రంలో అప్పులు చేస్తూ అడుక్కుంటున్న చంద్రబాబు సర్కారు.. ఏపీలో మాత్రం ఆ అడుక్కునే వారే లేకుండా చేస్తోంది.

తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భిక్షాటనపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఎవ్వరూ బిచ్చగాళ్లకు నగదు లేదా వస్తువులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో భిక్షాటన నియంత్రణ చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం, విదేశీ పెట్టుబడిదారుల ముందుకు ఒక సుస్థిర సామాజిక వాతావరణాన్ని చూపడం. నగరాలు, దేవస్థానాల వద్ద వ్యవస్థీకృతంగా భిక్షాటన జరుగుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

అలాగే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 (P4) కార్యక్రమం — ‘బంగారు కుటుంబాలు–మార్గదర్శులు’ ద్వారా పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లడమే లక్ష్యం. ఈ పథకం కింద బిచ్చగాళ్లను గుర్తించి వారికి రేషన్, వసతి, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు సమాచారం.

భిక్షాటనకు అలవాటు పడినవారిని సమాజంలో తిరిగి స్థిరపడేలా చేయడం సవాలుగా మారినా, ఈ నిర్ణయం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ఒక కీలక అడుగుగా భావించవచ్చు. అయితే చంద్రబాబు నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories