Top Stories

ఫోన్ ట్యాప్.. 10 కోట్లు డిమాండ్.. TV5 మూర్తిపై కేసు నమోదు

ప్రముఖ జర్నలిస్టు టీవీ5 మూర్తిపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వెనుక ఉన్న వివరాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

ఏపీ మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు, నటుడు ధర్మ సత్యసాయి మహేష్ తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేసి, వ్యక్తిగత విషయాలను టీవీలో టెలికాస్ట్ చేస్తూ, రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.

మహేష్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపి, పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి పోలీసులు A1‌గా గౌతమి చౌదరి, A2‌గా టీవీ5 మూర్తి పేర్లను చేర్చారు.

మహేష్‌తో వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఆయన భార్య గౌతమి చౌదరి, టీవీ5 మూర్తితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి.

మహేష్ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లుగా టీవీ5 మూర్తి తన ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి, తన ప్రైవేట్ సమాచారాన్ని మీడియా ద్వారా ప్రసారం చేస్తూ రూ.10 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపించారు.

ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించగా, టీవీ5 మూర్తి స్పందన ఇంకా రాలేదు. ఈ సంఘటన మీడియా వర్గాల్లో, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

https://x.com/TeluguScribe/status/1985887361427792099

Trending today

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

Topics

లోకేష్-తిలక్ వర్మ ఒక్కటేనట

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి....

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏపీ పార్టీలు..

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు...

విద్యార్థులే పనివాళ్లు.. కూటమి కథ

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో...

టీవీ5 సాంబశివరావు హైజాక్ చేశారు.

భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించింది. అద్భుతమైన...

గోచీ ఊడిపోయినా సరే.. జగన్ ను కలవాల్సిందే.. అంత అభిమానం

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని నెప్పల్లిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన...

పిఠాపురంలో దారుణ‌మైన రాజ‌కీయాలు

పేద‌రికానికి, ఆక‌లికి కులం ఉండ‌దు, అంద‌రి స‌మ‌స్యే. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మన...

సజ్జల చేతిలో మళ్లీ సాక్షి మీడియా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ...

Related Articles

Popular Categories