తెలుగు మీడియా రంగంలో తనదైన శైలి, తనదైన వ్యాఖ్యానాలతో సాంబ శివరావు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టీవీ5లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆయన చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ఎప్పుడూ చర్చనీయాంశాలవుతూనే ఉంటాయి. మాట తీరు, వ్యాఖ్యాన ధోరణి.. ఇవన్నీ ఆయనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ని తెచ్చిపెట్టాయి.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సాంబ శివరావు తన విమర్శలను వెనక్కి తిప్పుకోలేదు. జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన అనేక అంశాలపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్ల టీవీ5 అనుకూల ధోరణిలో ఉందన్న విమర్శల మధ్య, సాంబశివరావు వ్యాఖ్యలు మరింతగా ఫోకస్ అవుతున్నాయి.
ఇటీవల భారత్ వన్డే వరల్డ్కప్ గెలిచిన సందర్భంగా చేసిన ఒక వ్యాఖ్య ఆయనను మరోసారి ట్రోలింగ్ వలలోకి నెట్టింది. భారత జట్టు విజయాన్ని రాజకీయ కోణంలో విశ్లేషిస్తూ నారా లోకేష్ను ప్రస్తావించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ అనుకూల హ్యాండిల్స్ ఆ వీడియోను తెగ సర్క్యులేట్ చేస్తుండగా, దానికి సాంబశివరావు కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఆయన వార్నింగ్ కూడా మరోసారి ట్రోలింగ్ టార్గెట్గా మారింది. వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తూనే ఉంటే, సాంబ శివరావు తన స్టైల్ మార్చుకోరన్నది పక్కా. చివరికి ఎవరు తగ్గరు, కానీ జనాలకు మాత్రం ఈ ‘ట్రోల్ వర్సెస్ కామెంట్’ ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా అందుతోంది!


