Top Stories

ఈటీవీకి రూ.92.04 లక్షలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నీతులు చెబుతూ, మరోవైపు తన అనుకూల మీడియా సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారన్న ఆరోపణలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈటీవీకి భారీ మొత్తంలో నిధులు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత ఏడాది నవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకు ఈటీవీ నిర్వహించిన ‘కార్తీక దీపోత్సవం’ కార్యక్రమానికి ఏకంగా రూ.92.04 లక్షల ప్రజాధనాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించేలా ప్రసారాలు చేశారన్న కారణంతో ఈ చెల్లింపులు జరిపారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమకు జీతాలు రాక, ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారి ఆందోళనలు చేస్తున్నారు. వారికి సాయం చేయడానికి, సమస్య పరిష్కరించడానికి “నిధులు లేవు” అని చెబుతున్న ప్రభుత్వం.. ఈటీవీకి మాత్రం లక్షలు ఎలా కేటాయించిందన్నది ప్రధాన ప్రశ్న.

పొదుపు పాటించాలని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పే చంద్రబాబు, కేవలం తన అనుకూల మీడియాను పోషించడానికే ఈ నిధులు మళ్లించారని ప్రతిపక్షాలు మరియు ప్రజలు మండిపడుతున్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం తన పబ్లిసిటీకి మరియు అనుకూల మీడియా ఆర్థిక ప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఈ ఘటన నిరూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

https://x.com/JaganannaCNCTS/status/1991027793619288115?s=20

Trending today

సీరియస్ ఆలోచన దిశగా బొత్స!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం...

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సలహా

వైసీపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పిన...

టీవీ5 లో సాంబశివరావు సవాల్

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన...

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మరోసారి రాజకీయ చర్చలు చెలరేగుతున్నాయి. బీహార్...

మళ్లీ ‘అమరావతి’ ఉద్యమం

అమరావతి రైతుల్లో మరోసారి ఆందోళన చెలరేగుతోంది. రాజధానికి పూర్తి చట్టబద్ధత కల్పించి,...

Topics

సీరియస్ ఆలోచన దిశగా బొత్స!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం...

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సలహా

వైసీపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పిన...

టీవీ5 లో సాంబశివరావు సవాల్

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన...

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన

ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మరోసారి రాజకీయ చర్చలు చెలరేగుతున్నాయి. బీహార్...

మళ్లీ ‘అమరావతి’ ఉద్యమం

అమరావతి రైతుల్లో మరోసారి ఆందోళన చెలరేగుతోంది. రాజధానికి పూర్తి చట్టబద్ధత కల్పించి,...

అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషర్రఫ్ ‘బాబు’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం సోషల్...

టీవీ5 ‘సాంబ’న్న మళ్లీ ఏసాడు

టీవీ5 యాంకర్ సాంబశివరావు మరోసారి వార్తల్లోకెక్కారు. ఆయన ఇటీవల నారా లోకేష్‌పై...

వైసీపీలో కసి పెరిగింది..

ఏపీలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలపై తెలుగుదేశం పార్టీ...

Related Articles

Popular Categories