Top Stories

జగన్ రఫ్ఫా.. రఫ్ఫా..యెల్లో మీడియా అర్థనాదాలు 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. ఇటీవల నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన జగన్‌ను చూడడానికి తరలివచ్చిన జనసందోహాన్ని చూసి రాజకీయ వర్గాలే కాదు, విమర్శకులు సైతం ముక్కున వేలేసుకున్నారు.

సాధారణంగా కోర్టు వాయిదాలకు నాయకులు హాజరవడం సహజం. కానీ, జగన్ రాక మాత్రం ఒక సంచలనంగా మారింది. ఆయన వస్తున్నారని తెలియగానే తెలంగాణ నలుమూలల నుండి వైఎస్ఆర్ అభిమానులు, జగన్ సైనికులు భారీ సంఖ్యలో నాంపల్లి కోర్టు వద్దకు చేరుకున్నారు. “జై జగన్” నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ జగన్ కు వీరాభిమానులు ఉన్నారని ఈ ఘటన స్పష్టం చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ అభిమానమే నేడు జగన్ మోహన్ రెడ్డి రూపంలో వెల్లువెత్తింది. అధికారం ఉన్నా లేకపోయినా, ప్రాంతం ఏదైనా జగన్ కు ఉన్న క్రేజ్ తగ్గలేదని ఈ పరిణామం చాటిచెప్పింది.

జగన్ కు లభించిన ఈ అపూర్వ స్వాగతాన్ని చూసి విపక్ష మీడియా (ఎల్లో మీడియా) జీర్ణించుకోలేకపోతోంది. జగన్ తెలంగాణలో అడుగుపెడితే ఇంతటి స్పందన వస్తుందని వారు ఊహించలేకపోయారు. జగన్ కు జనం నీరాజనం పట్టడాన్ని తట్టుకోలేక, “ఇది బలప్రదర్శనా?” అంటూ పలు ఛానళ్లు డిబేట్లు పెట్టి తమ అక్కసును వెళ్లగక్కాయి.

జగన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెనుక జనం ఉండటం సహజం. అది బలప్రదర్శన కాదు, బలమైన ప్రజాదరణ. ఎల్లో మీడియా ఎన్ని అర్థనాదాలు చేసినా, ఎన్ని కథనాలు వండి వార్చినా.. ప్రజల గుండెల్లో జగన్ స్థానం “పదిలం” అని తెలంగాణ గడ్డ మరోసారి నిరూపించింది. జగన్ స్టైల్ లో చెప్పాలంటే.. ఇది నిజంగానే “రఫ్ఫా.. రఫ్ఫా” ఆడిించే మొగ్గు!

https://x.com/Samotimes2026/status/1991447010902507825?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories