Top Stories

పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం.. వైరల్ వీడియో

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఇటీవల పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల వేదికపై ‘ఘోర అవమానం’ జరిగిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, చర్చను రేకెత్తిస్తోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి సభ వేదికపైకి వచ్చినప్పుడు, ఆయన పక్కన ఉన్న ప్రముఖులను పలకరించే క్రమంలో జరిగిన ఒక దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ తన పక్కనే ఉన్న సినీ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఆప్యాయంగా పలకరించడం స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనే ఉన్న బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడి చేతిలో మోదీ తన చేయి వేసి పలకరించారు. అయితే, పవన్ కళ్యాణ్ (ఏపీ డిప్యూటీ సీఎం) పక్కనే ఉన్నప్పటికీ, ప్రధాని ఆయన వైపు చూడకుండా లేదా నేరుగా పలకరించకుండా వెళ్లిపోవడం ఈ వీడియోలో కనబడింది. పవన్‌ను దాటిన తర్వాత, నారా లోకేష్ వైపు చూసి మోదీ నమస్కారం చేసి ముందుకు సాగారు. ఈ దృశ్యం కారణంగా, ప్రధాని కావాలనే పవన్ కళ్యాణ్‌ను విస్మరించారని, ఇది ఒక రాజకీయ అవమానం అని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌కు జరిగిన ఈ ‘అవమానం’ తమ మనసును గాయపరిచిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ తమ అభిమాన నాయకుడిని తమ స్టైల్లో పౌరుషాన్ని చూపించమని కోరుతున్నారు. “ఇంతటి అవమానం మనకి అవసరమా” అంటూ ఈ వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాత పవర్ ఫుల్ డైలాగ్‌లను గుర్తు చేస్తూ, ఆయనలోని పోరాట యోధుడిని నిద్ర లేపాలని అభిమానులు పిలుపునిస్తున్నారు. ‘సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు’ అంటూ పాత డైలాగులు వల్లెవేస్తున్నారు.

ప్రస్తుతానికి, ఈ వీడియోపై జనసేన లేదా పవన్ కళ్యాణ్ తరపు నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే, ఈ దృశ్యం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

https://x.com/kurapati1005/status/1992659345688166494?s=20

Trending today

ఆంధ్రజ్యోతి ఆర్తనాదాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న అపూర్వ...

టీవీ5 సాంబపై మాస్ ర్యాగింగ్

టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత...

చంద్రబాబు సీరియస్

ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గతేడాది...

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్...

Topics

ఆంధ్రజ్యోతి ఆర్తనాదాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న అపూర్వ...

టీవీ5 సాంబపై మాస్ ర్యాగింగ్

టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత...

చంద్రబాబు సీరియస్

ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. గతేడాది...

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్...

అబద్ధాలను ప్రశ్నిస్తే ఉద్యోగం ఊస్ట్

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో మాజీ పులివెందుల సీఐ జె....

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత...

జగన్ ను ఎన్ కౌంటర్ చేయాలి.. ఎర్రబుక్ రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు లోనయ్యాయి. ప్రతిపక్ష నేత, వైఎస్సార్...

Related Articles

Popular Categories