టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తనను, తన ఛానెల్ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణులకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “వింటారా వినండి… చూసుకుందామంటే చూస్తాం… ఇప్పటితో ఆపకపోతే బర్లా చూసుకుందాం” అంటూ సాంబన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
సాంబశివరావు ఇటీవల తన లైవ్ షోలలో చేసే వ్యాఖ్యానం (కామెంట్రీ) సోషల్ మీడియాలో కామెడీ కంటెంట్గా మారింది. ఈ కామెంట్ల ఆధారంగా నెటిజన్లు, ముఖ్యంగా వైసీపీ మద్దతుదారులు ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సాంబన్న… టీవీ5 వేదికగా వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
“మీరెవరో నాకు తెలియదు. మా గురించి మాట్లాడుతున్నారు. మీరు వీడియోలు పెడితే 15 వేలు మంది పెడుతున్నారు. మేం పెడితే 15 లక్షల మంది చూస్తున్నారు. తేడా తెలుసుకోండి,” అంటూ తన ఛానెల్ రీచ్ను, తనకున్న ప్రజాదరణను ప్రస్తావించారు.
తమపై ట్రోలింగ్ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. “ఇప్పటితో ఆపకపోతే బర్లా చూసుకుందాం… చూసేవాళ్ళు చూడండి. వినేవాళ్ళు వినండి,” అంటూ తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు.
యాంకర్ సాంబశివరావు తనదైన శైలిలో, ఆవేశపూరితంగా చేసిన ఈ సవాల్… రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్కు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మరో మలుపు తిప్పింది. ఒక యాంకర్ బహిరంగంగా ఈ స్థాయిలో సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.


