Top Stories

బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేనికి సరైన గౌరవం దక్కడం లేదనే ప్రచారం ఇటీవల బలంగా నడిచింది. ఒంగోలులో జనసేన నేతలు కూడా ఆయన చేరికను పెద్దగా అంగీకరించకపోవడంతో, ఆయన తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో బాలినేనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ప్రభావం చూపించగలిగే నేతగా బాలినేనికి పేరుంది. ఆయనకు ఎమ్మెల్సీ హోదా కల్పిస్తే, జనసేన తరఫున మరింత బలంగా గళం వినిపించే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, బాలినేనితో కలిసి పనిచేసిన నేతలు చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చ్చి బాలినేనికి మద్దతుగా జనసేన వైపు టచ్‌లోకి వస్తారని పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారట… కానీ జగన్ అభిమానులు, నేతలు ఎవరూ కూడా కనీసం బాలినేని పట్టించుకోడం లేదు. ఆయన పడిపోయిన స్థాయిని గుర్తించడం లేదు. వైసీపీలోచెల్లని రూపాయిని పవన్ జనసేనలో చెల్లేలా చేయాలని చూస్తున్నాడు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

మరి ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అవుతుంది, పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎంతమేరకు ఫలితాలు ఇస్తాయి అనేది చూడాలి.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories