Top Stories

బాబు ఫైబర్ నెట్ కుంభకోణం : ఆధారాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలపై తమ వద్ద పటిష్టమైన ఆధారాలు ఉన్నాయని, సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ను కోర్టు అంగీకరించరాదని సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో గట్టిగా వాదించారు. ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి తరఫున ఆయన ఈ వాదనలు వినిపించారు.

చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి సీఐడీ గతంలోనే అన్ని ఆధారాలను సేకరించిందని, ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం కోర్టుకు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని పొన్నవోలు స్పష్టం చేశారు.

ఫైబర్‌నెట్‌ కుంభకోణానికి సంబంధించి బాబు అక్రమాలపై సీఐడీ అన్ని ఆధారాలు సేకరించింది. 90 మంది సాక్షులను విచారించింది. అక్రమాలకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సైతం చేయించింది. ఈ ఆధారాలన్నీ రికార్డుల్లో ఉన్నాయి, వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి.

సీఐడీ ఉన్నట్టుండి క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పొన్నవోలు తెలిపారు. గతంలో సేకరించిన ఆధారాలను, సాక్ష్యాలను పట్టించుకోకుండా, ప్రభుత్వం మారగానే సీఐడీ వైఖరి మార్చుకుందని ఆయన ఆరోపించారు.

చట్టం ప్రకారం ఈ కేసులో ఏసీబీ కోర్టుకు కేవలం మూడే ఆప్షన్లు ఉన్నాయని సుధాకర్‌రెడ్డి వివరించారు. కోర్టు ముందున్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని కేసును విచారణకు తీసుకోవాలి. సాక్ష్యాధారాలు సరిపోవని భావిస్తే, తదుపరి దర్యాప్తునకు ఆదేశించాలి. లేదంటే, సీఐడీ క్లోజర్‌ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తూ గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను ప్రైవేటు ఫిర్యాదుగా స్వీకరించాలి. సీఐడీ క్లోజర్‌ రిపోర్ట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకుంటే, ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం పోతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాధికారి భాస్కరరావు ఈ కేసులో తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని ప్రకటించారు. దీనిపై త్వరలోనే కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories