Top Stories

రఘురామ కృష్ణం రాజుపై పీవీ సునీల్ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఆయన ఆరోపణల ప్రకారం రఘురామ కృష్ణం రాజు “ఒక 420” అని తీవ్రంగా విమర్శించారు. త్వరలోనే ఆయన అరెస్టు అవుతారంటూ సంచలన అంచనాలు వెల్లడించారు.

జగన్ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్ గా కీలక బాధ్యతలు చేపట్టిన పీవీ సునీల్‌ మాట్లాడుతూ రఘురామ కృష్ణం రాజు పెద్ద స్థాయిలో స్కాంలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ స్కాంలకు సంబంధించిన కీలక సమాచారం ఆయన సన్నిహితుల నుంచే వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ వ్యవహారం మరింత ముందుకు వెళ్లితే రాష్ట్ర పరువు దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.

ఇలాంటి పరిస్థితుల్లో రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్‌ పదవిలో కొనసాగడం సమంజసం కాదని పీవీ సునీల్‌ స్పష్టం చేశారు. నైతిక బాధ్యతగా ఆయన్ను ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. “అరెస్టు జరిగితే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే ముందస్తుగా చర్యలు తీసుకోవాలి” అంటూ ఆయన గట్టిగా చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రతరం అవుతుండగా, మరోవైపు ఈ ఆరోపణలపై రఘురామ కృష్ణం రాజు నుంచి స్పందన ఏముంటుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.

https://x.com/greatandhranews/status/2002256628826189849?s=20

Trending today

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Topics

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

జనసేన పై పెద్ద రాజకీయ కుట్ర!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొంది. కూటమి వర్సెస్ వైయస్సార్...

ఏబీఎన్ లైవ్ లో వెంకటకృష్ణ శోకాలు

పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే...

పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు...

Related Articles

Popular Categories