దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఘాటుగా ప్రశ్నించారు. విశాఖపట్నంలో ‘మన రంగానాడు’ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ఉద్దేశిస్తూ—ఎన్నికల వేళ రంగా ఫోటోతో ఓట్లు అడిగే పార్టీలు, తర్వాత ఆయన ఆశయాలను ఎందుకు విస్మరిస్తున్నాయని నిలదీశారు. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం చేసిన పని ఏంటి?” అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.
రంగా పేరు మీద జిల్లా ప్రకటించాలన్న డిమాండ్ను మళ్లీ ముందుకు తెచ్చిన ఆశా కిరణ్—“ప్రజల మనోభావాలను ఎప్పుడూ గౌరవిస్తారు?” అని రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచారు. తాను వారసత్వ రాజకీయాల కోసం కాదు, రంగా ఆశయాల అమలే లక్ష్యమని స్పష్టం చేశారు. “ఆడపిల్లను సాఫ్ట్గా అనుకోవద్దు… నాలో రంగా రక్తమే” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసి ‘రాధా–రంగా మిత్ర మండలి’ని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తానని ప్రకటించారు. రంగా ప్రకటించిన ఐదు ప్రధాన ఆశయాలను ప్రజా ఎజెండాగా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఆశా కిరణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీస్తూ హాట్ టాపిక్గా మారాయి.
