Top Stories

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయోగాత్మక విమానం ల్యాండ్ అయిన సందర్భంగా స్పందించిన ఆయన… ఈ ప్రాజెక్ట్‌కు తానే ప్రధానంగా కృషి చేసినట్టు చెప్పుకొచ్చారు. పార్లమెంటులో మాట్లాడటం, మంత్రులతో సమావేశాలు పెట్టడం ద్వారా సమస్యలను లేవనెత్తానని, విశాఖ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. “అందులో మీ గొప్పతనం ఏముంది విజయసాయిరెడ్డి గారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. పార్టీ తరపున గెలిచి, పార్టీ ఇచ్చిన పదవితోనే రాజ్యసభలో మాట్లాడిన విషయాన్ని మరిచి… మొత్తం క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ నేతల వాదన స్పష్టంగా ఒకటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్ట్‌కు దిశా నిర్దేశం జరిగిందని, కర్త–కర్మ–క్రియ అన్నీ ఆయనేనని చెబుతున్నారు. కేంద్రంతో చర్చలు, అడ్డంకుల తొలగింపు, భూసేకరణ నుంచి పాలసీ స్థాయి నిర్ణయాల వరకు జగన్‌దే కీలక పాత్ర అని స్పష్టం చేస్తున్నారు.

“టికెట్ ఇచ్చింది జగన్, ఎంపీ పదవి ఇచ్చింది జగన్. వైసీపీ తరపునే మీరు రాజ్యసభలో మాట్లాడారు. అలాంటప్పుడు పార్టీని, నాయకత్వాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత క్రెడిట్ తీసుకోవడం సరికాదని” వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.

భోగాపురం విషయంలో మిగతావాళ్ల పాత్రను వారు వ్యంగ్యంగా అభివర్ణిస్తున్నారు. “ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్టే… అసలు పని చేసింది ఒకరే, హడావిడి చేసిన వాళ్లు వేరే” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మొత్తానికి భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌పై మొదలైన ఈ వివాదం… వైసీపీ అంతర్గత రాజకీయాల్లో మరోసారి కాకరేపుతోంది. క్రెడిట్ ఎవరిది అన్న ప్రశ్నకు పార్టీ శ్రేణులు మాత్రం ఒకే మాట చెబుతున్నాయి — అన్నీ జగన్‌దే, మిగతావాళ్లది హడావిడే!

Trending today

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

Topics

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

Related Articles

Popular Categories