పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా, పాకిస్తాన్ రాజకీయ పార్టీలకూ రాకూడదన్న స్థాయిలో ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్లో యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ప్రజల స్పందనను చూసి జీర్ణించుకోలేకపోయినట్టుగా ఆయన మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ తాడేపల్లి నుంచి గుంటూరు అంబటి రాంబాబు ఇంటికి చేరేందుకు ఆరు గంటలు పట్టిందని, ప్రజలు తిండి–నిద్ర మానేసి ఎదురుచూశారని, జగన్ మాత్రం తినేసి తాపీగా వచ్చాడంటూ చేసిన వ్యాఖ్యలు పచ్చ మీడియా అసహనానికి నిదర్శనమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. నిజానికి ఆ వ్యాఖ్యలు జగన్ క్రేజ్ను మరింత హైలైట్ చేశాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఏబీఎన్ లైవ్లో వెంకటకృష్ణ శోకాలు పెట్టినట్టుగా మాట్లాడిన వీడియో క్లిప్స్పై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. “జగన్కు వచ్చిన జనసంద్రాన్ని చూసి ఏడుపు తప్ప ఇంకేమీ చేయలేకపోయారు” అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి జగన్ క్రేజ్ పచ్చ మీడియాకు జీర్ణం కావడం లేదన్న మాట మరోసారి నిజమైంది.
https://x.com/Jagananna2Po/status/2019055692879979003?s=20

